Saturday, June 7, 2025
E-PAPER
Homeసినిమాచెట్ల విలువ తెలిపే 'కలివి వనం'

చెట్ల విలువ తెలిపే ‘కలివి వనం’

- Advertisement -

వక్షో రక్షతి రక్షితః అన్నారు పెద్దలు. ఇలాంటి మంచి సందేశాన్నిస్తూ వనాలను సంరక్షించుకోవాలనే కాన్సెప్ట్‌తో పూర్తి తెలంగాణ పల్లెటూరి బ్యాక్‌డ్రాప్‌లో చిత్రీకరించిన సినిమా ‘కలివి వనం’. ఈ చిత్రంలో రఘుబాబు, సమ్మెట గాంధీ, విజయలక్ష్మి, బిత్తిరి సత్తి, బలగం సత్యనారాయణ, మహేంద్ర నాథ్‌, సతీష్‌ శ్రీ చరణ్‌, అశోక్‌ తదితరులు కీలకపాత్రలు పోషించారు. హీరోయిన్‌గా నాగదుర్గ పరిచయమవుతోంది. ఏఆర్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌ పై రాజ్‌ నరేంద్ర రచనా దర్శకత్వంలో మల్లికార్జున్‌ రెడ్డి, విష్ణువర్ధన్‌ రెడ్డి నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్ర టీజర్‌ను సినీ పాత్రికేయులైన టీ.యఫ్‌. జె.ఏ.ప్రెసిడెంట్‌ లక్ష్మీనారాయణ, టీ.యఫ్‌.జె.ఏ. వైస్‌ ప్రెసిడెంట్‌ వై.జె. రాంబాబు, లక్ష్మి నారాయణ, సినీజోష్‌ సీఈఓ రాంబాబు, గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ రాఘవ, దుష్చర్ల సత్యనారాయణ విడుదల చేశారు. నిర్మాత మల్లికార్జున్‌ రెడ్డి మాట్లాడుతూ, ‘దర్శకుడు రాజ్‌లాగే నాకు కూడా చెట్లంటే ఇష్టం. అందుకే ఈ సినిమాను రూపొందించాను’ అని తెలిపారు. ‘అందరి సపోర్ట్‌తో ఒక మంచి చిత్రాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాం. చెట్ల విలువ తెలిపే సినిమా ఇది’ అని నిర్మాత విష్ణువర్థన్‌ రెడ్డి చెప్పారు.
దర్శకుడు రాజ్‌ నరేంద్ర మాట్లాడుతూ, ‘100% మాది కమర్షియల్‌ చిత్రం. పిల్లల నుంచి పెద్దల దాకా చూడాల్సిన సినిమా. ప్రేక్షకుల మనసులను తాకే చిత్రమిది’ అని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -