Sunday, June 8, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు

అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు

- Advertisement -

– వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాలెపు నర్సయ్య 
– ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం
నవతెలంగాణ – కమ్మర్ పల్లి : మండలంలో అర్హులైన ప్రతి ఒక్కరికి రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తుందని కమ్మర్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాలేపు నర్సయ్య అన్నారు. శనివారం మండలంలోని నాగాపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ప్రభుత్వం మండలంలో నాగాపూర్ గ్రామాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి ఇందిరమ్మ ఇండ్ల మంజూరు చేయడంతో లబ్ధిదారులు నిర్మాణాలను చేపట్టారు. గ్రామానికి చెందిన 8 మంది లబ్ధిదారుల ఇందిరమ్మ ఇండ్ల బేస్మెంట్ లెవెల్ పనులు పూర్తయిన నేపథ్యంలో వారికి ప్రభుత్వం మొదటి విడతగా లక్ష రూపాయలను వారి ఖాతాల్లో జమ చేసింది. ఖాతాల్లో లక్ష రూపాయలు జమడం జమ అవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ లబ్ధిదారులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న మార్కెట్ కమిటీ చైర్మన్ పాలెపు నర్సయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరు సొంతింటిని కలిగి ఉండాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కల అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంతో కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సొంతింటి కలను నిజం చేస్తుందన్నారు. లబ్ధిదారులకు మొదటి విడత లక్ష రూపాయలు ఖాతాలో వేసిన రాష్ట్ర ప్రభుత్వానికి లబ్ధిదారుల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కంపదండి అశోక్, నాయకులు  పాలెపు రాజేశ్వర్, శశిధర్, కిషన్, గంగాధర్, రమేష్,

లబ్ధిదారులు దేశ బోయిన మల్లు, గంధం సునంద, ఈర్నాల లక్ష్మి, గుండ జయ, కర్రీ వనిత, జాదవ్ గంగామణి, కౌడ మల్లు, ఆడే సుప్రియ, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -