Sunday, June 8, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్యువత సన్మార్గంలో నడవాలి..

యువత సన్మార్గంలో నడవాలి..

- Advertisement -

నవతెలంగాణ –  జుక్కల్ : యువత దురాలవాట్లకు దూరంగా ఉన్నప్పుడే సామాజిక న్యాయం జరుగుతుందని నానిజ్ రామ్ జగద్గురు స్వామి నరేంద్ర మహారాజ్ అన్నారు. శనివారం జుక్కల్ మండలంలోని దోచుపల్లి గ్రామంలో నెలకొల్పిన ఉపపీఠం ఆధ్వర్యంలో భక్తులకు స్వామీజీ దర్శనమిచ్చి ప్రవచనాలు చేశారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.. యువత చెడుదోవ పట్టకుండా మంచి మార్గంలో ఉండేందుకు ఆర్థిక స్వలాంబన జరగాలని, ప్రపంచంలో కెల్లా అత్యధికంగా యువకులు ఉన్న దేశం మన భారతదేశం అని అన్నారు. ఉపపీఠం ఆధ్వర్యంలో పేద ప్రజలకు నిరుపేదలకు ఆరోగ్యం, విద్య, వైద్యం విషయంలో ట్రస్ట్ ముందుంటుందని తెలిపారు. ప్రతి ఒక్కరికి విద్యా వైద్యం అందించేందుకు పీఠాధిపతి ఆధ్వర్యంలో యువత పనిచేస్తుందని, వారి సమాచారం మేరకే పేదలకు తమ వంతుగా సమాజసేవ చేస్తున్నామని అన్నారు.

వైద్య విద్యను నేర్చుకుంటున్న డాక్టర్లకు ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎవరైనా భక్తులు చనిపోయినప్పుడు కుటుంబ సభ్యులకు కోరిక మేరకు వారి మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రులకు ఇప్పటికే 117 దేహాలను అందించామని అన్నారు. అనేక నేత్రదానాలు చేశామని, పేద ప్రజలకు వైద్యం అందించేందుకు దూరప్రాంతాల ఆస్పత్రులకు వెళ్లడానికి అంబులెన్సులు ఇప్పటికే ప్రవేశపెట్టామని తెలిపారు. వాటితో పాటు మృత్యువుకు దగ్గరలో ఉన్న భక్తులు వారి కుటుంబ సభ్యుల ఒప్పందం ప్రకారం వారి అవయ దానాలు కూడా నిర్వహించామని పేర్కొన్నారు. మహిళా విద్యార్థినిలకు ఈ సంవత్సరం నుంచి విద్య, వైద్యాన్ని అందించాలని ట్రస్ట్ నిర్ణయించిందని తెలిపారు. వేద విద్యను అభ్యసించిన వారికి ఉపాధి కల్పించేందుకు వివిధ ఆలయాలలో వారిని నియమిస్తున్నామని అన్నారు. ధర్మాన్ని కాపాడడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని గుర్తు చేశారు. సమాజములోని మనుషుల భేదాలు ఉడొద్దని, దైవం దృష్టిలో అందరూ సమానులేనని స్వామీజీ అన్నారు. 

శనివారం దర్శన కార్యక్రమంలో భక్తులు భారీగా పాల్గొనడంతో ఉపపీఠం వద్ద సందడి నెలకొంది. స్వామీజీని దర్శించుకునేందుకు భక్తులు కిలోమీటర్ పొడుగునా క్యూ లైన్ లో నిలబడ్డారు. వచ్చిన భక్తులకు త్రాగు నీరు , మహా అన్న ప్రసాదం, కల్పించారు. ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ట్రస్ట్ సభ్యులు భారీ బందోబస్తుతో పాటు అన్ని ఏర్పాట్లు చేశారు. సుమారుగా పది వేలపై చిలుకు మంది భక్తులు కర్ణాటక మహారాష్ట్ర రాష్ట్రాల నుండి కాక మన తెలంగాణ నుండి కూడా భారీ సంఖ్యలో భక్తులు రావడంతో పీఠం ప్రాంగణమంతా జనసంద్రాహంతో నిండిపోయింది. స్వామీజీ కార్యక్రమం రెండు రోజుల ఉంటుందని, భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. రెండు రోజులు ఉపపీఠంలోనే స్వామీజీ కొలువుదీరుతారని, అందరికీ స్వామీజీ కలుస్తారని ట్రస్ట్ సభ్యులు తెలిపారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -