- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : ఎంతో కాలంగా సాంప్రదాయ పద్దతిలో వస్తున్నా చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమం ఈ రోజు ప్రారంభం అయింది. ప్రతి సంవత్సరం మాదిరిగానే మృగశిర కార్తి సందర్భంగా హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేప ప్రసాదాన్ని ప్రజలకు అందజేశారు. ఆస్తమా, శ్వాస సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వేలాది మంది ఈ ప్రసాదం కోసం తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, బీహార్, ఉత్తర ప్రదేశ్ వంటి ఇతర రాష్ట్రాల నుంచి తరలి వస్తున్నారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను చేసింది. జూన్ 8, 9 తేదీల్లో రెండు రోజుల పాటు ఈ చేప ప్రసాదాన్ని ప్రజలకు అందించనున్నారు.
- Advertisement -