నవతెలంగాణ-హైదరాబాద్: మణిపూర్లో భద్రతా బలగాలు కీలక సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. భారత సైన్యం, అస్సాం రైఫిల్స్ కలిసి కొండ, లోయ ప్రాంత జిల్లాల్లో సెర్చ్ ఆపరేషన్ నిర్వహించాయి. కాంగ్పోక్పి, తౌబల్, కక్చింగ్, తెంగ్నౌపాల్, బిష్ణుపూర్, జిరిబామ్, ఇంఫాల్ ఈస్ట్, ఇంఫాల్ వెస్ట్ తదితర ప్రాంతాల్లో సోదాలు నిర్వహించామని ఈ మేరకు ఉన్నతాధికారులు సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ప్రత్యేక ఆపరేషన్ మే 26 నుంచి జూన్ 5వరకు చేట్టామన్నారు.
ఈ ఆపరేషన్ లో భాగంగా 40 ఆయుధాలు, తొమ్మిది ఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైజెస్ (IED), గ్రెనేడ్లు, మందుగుండు సామగ్రి, యుద్ధ సామగ్రి దుకాణాలను స్వాధీనం చేసుకున్నమాని తెలిపారు. ఇంఫాల్ తూర్పు జిల్లాలోని చాడోంగ్ సాధారణ ప్రాంతంలో క్యాడర్ల కదలిక, IEDల ఉనికిపై నిర్దిష్ట నిఘా సమాచారం ఆయా స్థావరాలపై దాడులు చేశామని అధికారులు పేర్కొన్నారు.