Tuesday, June 10, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వంట కార్మికుల పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలి..

వంట కార్మికుల పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలి..

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ : మధ్యాహ్న భోజన పాఠశాల వంట కార్మికుల పెండింగ్ బిల్లులు, వేతనాలు వెంటనే విడుదల చేయాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండీ ఇమ్రాన్ డిమాండ్ చేశారు. సోమవారం రోజున వంట కార్మికుల సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా నిరసన తెలిపి జిల్లా కలెక్టర్ హనుమంతరావు, అదనపు కలెక్టర్ భాస్కర్ రావు కి వినతి పత్రాలు అందజేశారు. ఈ సందర్బంగా ఇమ్రాన్ మాట్లాడుతూ.. పాఠశాలలు ప్రారంభానికి రెండు రోజులే ఉందని,  వంట కార్మికులకు గత సంవత్సరం వంట బిల్లులు, వేతనాలు, కోడి గుడ్ల బిల్లులు పెండింగ్ లోనే ఉన్నాయని తెలిపారు. ఇప్పుడు వంటలు ఎలా చేయాలో అధికారులు ఆలోచన చేయాలని కోరారు.  2023 అక్టోబరు నెల నుండి అల్పాహారం బిల్లులు కూడా పెండింగ్ లోనే ఉన్నాయి అన్నారు. రాగి జావ తయారు చేయడానికి గ్యాస్ సిలిండర్ల ఖర్చు చాలా అవుతుందని, ఎలాంటి పారితోషికం లేకుండా తయారు చేయడం ఇబ్బంది కనుక రాగి జావకు ప్రతీ విద్యార్థికి రూ.2/- చెల్లించాలని డిమాండ్ చేశారు.  కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు రూ 10 వేల వేతనం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. పెండింగ్ బిల్లులు వేతనాలు కోడి గుడ్ల బిల్లులు అన్నీ పాఠశాలలు ప్రారంభానికి ముందే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి జిల్లా కార్యవర్గ సభ్యులు సామల శోభన్ బాబు, మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు బాగుల వసంత,  జిల్లా ప్రధాన కార్యదర్శి ముంతాజ్ బేగం, నాయకులు అనసూర్య, పారిజాత, స్వేత, పూర్ణమా, రమ, లక్ష్మమ్మ, రమ, వరలక్ష్మి, రత్న, జాన్సీ, రూప, మున్ని, లక్ష్మి, రేణుక, వెంకటమ్మ, పారిజాత, పుష్ప, గంగమ్మ,  పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -