మరికొందరు అధికారులు, జవాన్లకు గాయాలు
నేడు మావోయిస్టుల భారత్ బంద్
నవతెలంగాణ-చర్ల
పోలీసులే లక్ష్యంగా మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలి కుంట ఏఎస్పీ ఆకాశ్రావు మృతి చెందారు. సుకుమా జిల్లా కొంటా-ఎర్రబోరు రోడ్డులోని డోండ్రా సమీపంలో సోమవారం జరిగిన ప్రెషర్ ఐఈడీ పేలుడులో ఆయన మృతి చెందినట్టు అధికారులు తెలిపారు. జూన్ 10న భారత్ బంద్కు పిలుపునిచ్చిన దృష్ట్యా, మావోయిస్టుల చర్యలను నివారించడానికి అదనపు ఎస్పీ ఆకాష్ ఆ ప్రాంతంలో ఫుట్ పెట్రోలింగ్ విధుల్లో ఉన్నారు. ఈ సమయంలో ఒక్కసారిగా పేలుళ్లు సంభవించాయి. ఈ ప్రెషర్ ఐఈడీ పేలుడులో ఆకాష్తో పాటు మరికొందరు అధికారులు, జవాన్లు గాయపడ్డారు. గాయపడిన వారిలో ఆకాష్రావు మృతి చెందారు. మిగిలిన వారు కొంటా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారికి మెరుగైన చికిత్స కోసం రాయపూర్ తరలించినట్టు అధికారులు తెలిపారు.
మందుపాతర పేలి ఏఎస్పీ మృతి
- Advertisement -
- Advertisement -