Tuesday, June 10, 2025
E-PAPER
Homeజాతీయంమందుపాతర పేలి ఏఎస్పీ మృతి

మందుపాతర పేలి ఏఎస్పీ మృతి

- Advertisement -

మరికొందరు అధికారులు, జవాన్లకు గాయాలు
నేడు మావోయిస్టుల భారత్‌ బంద్‌
నవతెలంగాణ-చర్ల

పోలీసులే లక్ష్యంగా మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలి కుంట ఏఎస్పీ ఆకాశ్‌రావు మృతి చెందారు. సుకుమా జిల్లా కొంటా-ఎర్రబోరు రోడ్డులోని డోండ్రా సమీపంలో సోమవారం జరిగిన ప్రెషర్‌ ఐఈడీ పేలుడులో ఆయన మృతి చెందినట్టు అధికారులు తెలిపారు. జూన్‌ 10న భారత్‌ బంద్‌కు పిలుపునిచ్చిన దృష్ట్యా, మావోయిస్టుల చర్యలను నివారించడానికి అదనపు ఎస్పీ ఆకాష్‌ ఆ ప్రాంతంలో ఫుట్‌ పెట్రోలింగ్‌ విధుల్లో ఉన్నారు. ఈ సమయంలో ఒక్కసారిగా పేలుళ్లు సంభవించాయి. ఈ ప్రెషర్‌ ఐఈడీ పేలుడులో ఆకాష్‌తో పాటు మరికొందరు అధికారులు, జవాన్లు గాయపడ్డారు. గాయపడిన వారిలో ఆకాష్‌రావు మృతి చెందారు. మిగిలిన వారు కొంటా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారికి మెరుగైన చికిత్స కోసం రాయపూర్‌ తరలించినట్టు అధికారులు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -