– ఎమ్మెల్సీ శ్రీపాల్రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ గురుకుల పాఠశాలల పనివేళల మార్పునకు ప్రభుత్వం అంగీకారం తెలిపిందని ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్రెడ్డి తెలిపారు. అందుకు సంబంధించిన ఉత్తర్వులు వెలువడతాయని పేర్కొన్నారు. సోమవారం హైదరాబాద్లోని సచివాలయంలో ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు అజిత్రెడ్డి, వేముల శ్రీనివాస్ను ఆయన కలిసి వినతిపత్రం అందజేశారు. గురుకుల పాఠశాలల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. సీఎం ఆదేశాల మేరకు త్వరలోనే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ద్వారా తగు ఉత్తర్వులను విడుదల చేయనున్నట్టు హామీ ఇచ్చారని తెలిపారు. గురుకుల ఉపాధ్యాయులకు 010 పద్దు కింద వేతనాలు చెల్లించాలనీ, హెల్త్ కార్డులు ఇవ్వాలనీ, గెజిటెడ్ హోదా కల్పించాలని కోరారు. గురుకుల పాఠశాలల ఉమ్మడి డైరెక్టరేట్, తాత్కాలిక ఉద్యోగులకు 12 నెలల వేతనాలు ఇవ్వాలని తెలిపారు. ఆ సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామంటూ వారు హామీ ఇచ్చారని పేర్కొన్నారు. ప్రభుత్వ, పంచాయతీరాజ్, గురుకుల ఉపాధ్యాయులందరికీ పదోన్నతులు కల్పించడానికి ప్రభుత్వం కసరత్తు ప్రారంభించిందదంటూ సీఎంవో, విద్యాశాఖ అధికారులు చెప్పారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పీఆర్టీయూటీఎస్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గుండు లక్ష్మణ్, పుల్గం దామోదర్రెడ్డి, రాష్ట్ర బాధ్యులు శ్రీనివాస్రెడ్డి, పీఆర్జీటీఏ బాధ్యులు వేంరెడ్డి దిలీప్రెడ్డి, ఉప్ప అశోక్, సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
గురుకులాల పనివేళల మార్పునకు ప్రభుత్వం అంగీకారం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES