ఐదేండ్ల లోపు చిన్నారులకు అన్నిరకాల వైద్య పరీక్షలు
అవసరమైతే ఉచితంగా శస్త్రచికిత్సలు
మహిళలను ఆర్థిక బలోపేతం చేయడమే లక్ష్యం : మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో బాల భరోసా పేరుతో కొత్త పథకం తీసుకురాబోతున్నామనీ, ఐదేండ్ల లోపు చిన్నారులకు అన్ని రకాల వైద్య పరీక్షలు ఉచితంగా చేయిస్తామని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ ప్రకటించారు. అవస రమైన వారికి శస్త్రచికిత్సలు కూడా ఉచితంగా చేయిస్తామని వెల్లడించారు. మంగళవారం హైదరాబాద్లోని సచివాల యంలో జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మహిళా సంఘాలతో సోలార్ ప్లాంట్లు, పెట్రోల్ బంకులు, ఏర్పాటు చేయించడం, కొత్త మహిళా సభ్యుల గుర్తింపు, కిశోర బాలికలు, వికలాంగులు, వయోధిక మహిళా సంఘాల ఏర్పాటు, ఇందిరమ్మ మహిళా శక్తి భవనాల నిర్మాణ పనుల పురోగతి, మహిళా సంఘాలతో ప్రభుత్వ పాఠశాలల స్కూల్ యూనిఫాంలు కుట్టించడం, తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. అందులో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి కార్యదర్శి లోకేశ్కుమార్, సెర్ప్ సీఈఓ దివ్యా దేవరాజన్, పీఆర్ఆర్డీ డైరెక్టర్ సృజన, మహిళా శిశుసంక్షేమ శాఖ డైరెక్టర్ క్రాంతి వెస్లీ, వికలాంగులు, వయోవృద్ధులు, ట్రాన్స్జెండర్ పర్సన్ సాధికార శాఖ డైరెక్టర్ శైలజ, ఇతర అధికారులు పాల్గొన్నారు. తెలంగాణ రైజింగ్ 2047 సాకారంలో భాగంగా కోటి మంది మహిళలను కోటిశ్వరులను చేసే లక్ష్యంతో కలెక్టర్లు పనిచేయాలని ఆదేశించారు. మహిళా సంఘాలతో సోలార్ ప్లాంట్లు, పెట్రోల్ బంకులు ఏర్పాటు చేయించేలా కృషి చేయాలనీ, వాటికి అవసరమైన స్థలాలను తక్షణమే గుర్తించాలని సూచించారు. అక్టోబర్ 2న సోలార్ ప్లాంట్లు ప్రారంభించే లక్ష్యంతో కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. కంపెనీలతో సమన్వయం చేసుకుని సోలార్ ప్లాంట్ల పనులను ప్రారంభించాలని సూచించారు. 22 జిల్లాల్లో ఇందిరా మహిళా శక్తి భవనాల నిర్మాణ పనులను నవంబర్ లోపు పూర్తి చేయాలని నొక్కిచెప్పారు. అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలలు బాగుంటేనే పేద పిల్లలకు ఉపయోగమనీ, వాటిమీద ఫోకస్ పెట్టాలని సూచించారు. 90 శాతం యూనిఫాం కుట్టుపనులు పూర్తయ్యాయని చెప్పారు. బుధవారం నుంచి అంగన్వాడీ కేంద్రాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో కలెక్టర్లంతా వాటి నిర్వహణ ఎలా ఉందో చెక్ చేయాలని సూచించారు. అంగన్వాడీలను ప్రయివేటు ప్లే స్కూళ్లకు దీటుగా తీర్చిదిద్దాలన్నారు. కొత్తగా నిర్మించబోయే 1000 అంగన్వాడీ కేంద్రాలకు స్థలాలను సేకరించాలన్నారు. అర్హులైన ప్రతి మహిళా ఎస్హెచ్జీలో ఉండేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వికలాంగుల ధ్రువీకరణ పత్రాల కోసం 38 ఆస్పత్రుల్లో పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు మాట్లాడుతూ…ఇందిరా మహిళా శక్తి పాలసీ అత్యంత కీలకమైనదని నొక్కి చెప్పారు. 18 ఏండ్లు నిండిన ప్రతి మహిళా సంఘంలో సభ్యురాలిగా ఉండేలా చూడాలన్నారు. ఓటర్ లిస్టు తీసుకుని నూతన సభ్యులను గుర్తించాలని సూచించారు. పట్టణ మహిళలు, వికలాంగు లు, వయోధికులతో ప్రత్యేక మహిళా స్వయం సహాయక బృందాలను ఏర్పాటు చేసేలా కలెక్టర్లు చొరవ చూపాలని ఆదేశించారు. ఇందిరా మహిళా శక్తి పథకంపై సెర్ప్ సీఈఓ దివ్వా దేవరాజన్ పవర్పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
త్వరలో ‘బాల భరోసా’
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES