నవతెలంగాణ-హైదరాబాద్: అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మృతి చెందిన మాజీ సీఎం విజయ్ రూపానీ కుటుంబసభ్యులను ప్రధాని మోడీ పరామర్శించారు. విజయ్ భాయ్ మన మధ్య లేరనే నిజాన్ని నమ్మలేకపోతున్నాను. చాలా ఏళ్లుగా ఆయన నాకు తెలుసు. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో, సవాళ్ళతో కూడిన సమయాల్లో విజయ్ కష్టపడి పని చేశారు. పార్టీ సిద్ధాంతానికి కట్టుబడి ఉండేవారు. వివిధ బాధ్యతలు నిర్వర్తిస్తూ ఉన్నతస్థాయికి ఎదిగి, సీఎంగా సేవలు అందించారు..” అంటూ మోడీ ట్వీట్ చేశారు. బీజేపీ చెందిన విజయ్ రామ్నిక్లాల్భాయ్ రూపానీ 2016 నుంచి 2021 వరకు రెండు సార్లు గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆయనకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె కాగా.. చిన్న కుమారుడు పూజిత్ ఓ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు.
తొలుత విజయ్ రూపానీ పేరుతో ఒక టికెట్ తొలుత నెట్టింట వైరల్గా మారింది. అందులో బోర్డింగ్ సమయం మధ్యాహ్నం 12.10 గంటలుగా ఉంది. ఆయన విమానం ఎక్కినట్లు నిర్ధరించే ప్యాసింజర్ జాబితాలోనూ రూపానీ పేరు ఉంది. లండన్లో ఉంటున్న తన కుమార్తెను చూసేందుకు విజయ్ రూపానీ ఈ విమానంలో ప్రయాణానికి బుక్ చేసుకున్నట్లు స్థానిక మీడియాలో కథనాలు వచ్చాయి.