- Advertisement -
నవతెలంగాణ పెద్దవంగర:
మండల కేంద్రంలోని ఎక్స్ రోడ్డు ప్రాథమిక పాఠశాలలో సామూహిక అక్షరాభ్యాసాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ప్రధానోపాధ్యాయుడు సత్యనారాయణ, ఉపాధ్యాయురాలు సౌభాగ్య పాఠశాలలో నూతనంగా చేరిన చిన్నారులకు పలకల పై అక్షరాలు దిద్దించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు మాట్లాడుతూ.. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతుందన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపించాలని కోరారు.
- Advertisement -