Sunday, June 15, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఘనంగా సామూహిక అక్షరాభ్యాసం 

ఘనంగా సామూహిక అక్షరాభ్యాసం 

- Advertisement -

నవతెలంగాణ పెద్దవంగర:

మండల కేంద్రంలోని ఎక్స్ రోడ్డు ప్రాథమిక పాఠశాలలో సామూహిక అక్షరాభ్యాసాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ప్రధానోపాధ్యాయుడు సత్యనారాయణ, ఉపాధ్యాయురాలు సౌభాగ్య పాఠశాలలో నూతనంగా చేరిన చిన్నారులకు పలకల పై అక్షరాలు దిద్దించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు మాట్లాడుతూ.. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతుందన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపించాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -