Sunday, June 15, 2025
E-PAPER
HomeNewsమృతుని కుటుంబానికి రూ. 5 వేల ఆర్థిక సాయం

మృతుని కుటుంబానికి రూ. 5 వేల ఆర్థిక సాయం

- Advertisement -

నవతెలంగాణ -తాడ్వాయి 
మండలంలోని తాడ్వాయి గ్రామపంచాయతీ పరిధిలో గల లవ్వాల ఆదివాసి గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో ఎట్టి సాగర్ తండ్రి ఎట్టి అల్లయ్య మృతి చెందాడు. శుక్రవారం అతని దశదినకర్మకు బిల్లు ఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి, జెడ్పి చైర్ పర్సన్ మాజీ అధ్యక్షురాలు బడే నాగజ్యోతి, మాజీ జెడ్పిటిసి శ్రీనివాస్ రెడ్డి, టిఆర్ఎస్ శ్రేణులతో కలిసి వచ్చి ఓదార్చారు. చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారికి 5000 రూపాయలు ఆర్థిక సాయం అందించారు. ఎట్టి అల్లయ్య చాలా మంచివారని, మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరంగా ఉన్నారు. వారి కుటుంబానికి బిఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడు అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి రామ సహాయం శ్రీనివాస్ రెడ్డి, మాజీ సర్పంచ్ ఈసం రామ్మూర్తి, నాలి రామారావు, ఈసం సాంబయ్య, ఇరుప సంతోష్, నాలి నాగలక్ష్మి, గారు, భోజబోయిన నాగరాణి గారు, వట్టం లక్ష్మయ్య, పాయం కన్నయ్య,బ కొమరం సిద్దు   తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -