నవతెలంగాణ – మద్నూర్ : పల్లెల ప్రగతి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గ్రామ పంచాయతీకి ఒక ట్రాక్టర్ను, నీటి ట్యాంకర్ ను ఏర్పాటు చేయడం జరిగింది. అలాంటి వాహనాలు గ్రామ అవసరాల కోసమా లేక కాంట్రాక్టర్ల పనుల కోసమా అని భిన్న అభిప్రాయాలు ప్రజల్లో వ్యక్తం అవుతున్నాయి. మద్నూర్ మండల కేంద్రంలో సిసి రోడ్డు కాంట్రాక్టు పనులు కొనసాగుతున్న వాటికి దన్నూర్ గ్రామపంచాయతీ నీటి ట్యాంకర్ వాడుతున్నారు. పల్లె ప్రగతి కోసం వాడుకునే పంచాయతీ వాహనాలు కాంట్రాక్టర్ పనుల్లో వాడుకుంటే, ఈ పనుల వల్ల వాహనాలు చెడిపోతే బాధ్యులు ఎవరని దానిపై ప్రజలు రకరకాల చర్చలు జరుపుకుంటున్నారు. ఏ గ్రామంలోని పంచాయతీ వాహనాలు ఆ గ్రామంలోని ఆ గ్రామ అవసరాలకు మాత్రమే వాడుకోవాలని నిబంధనాలను అధికారులు ఎందుకు పట్టించుకోవడంలేదనే ఆరా తీస్తున్నారు. ఈ విషయంపై దన్నూరు గ్రామ కార్యదర్శి జాదవ్ మనోహర్ కు ఫోన్ ద్వారా వివరణ కోరగా.. రోజుకు రూ.200 చొప్పున అద్దెకు ఇస్తున్నట్లు తెలిపారు. ఇలాంటి రూల్స్ ఉన్నాయా అని అడిగితే పంచాయితీకి పాలకవర్గం ఉంటే ఇలాగే ఉంటుందని, పాలకవర్గం లేనందున రోజుకు రూ.200 చొప్పున అద్దె వసూళ్లు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
పంచాయతీ వాహనాలు కాంట్రాక్టర్ల కోసమా..గ్రామాల కోసమా ?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES