నవతెలంగాణ-హైదరాబాద్: అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బోయింగ్ డ్రీమ్ లైనర్ విమానాల సిరిస్ పై భద్రతా పరమైన నిఘా పెంచుతున్నట్లు పేర్కొంది. ప్రయాణికుల భద్రత నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు డైరెక్టర్ జనరల్ ఆప్ సివిల్ ఏవియేషన్ (DGCA)ఈ మేరకు ఏ ప్రకటన జారీ చేసింది. ఎనిమిది బోయింగ్ 787 సిరీస్ విమానాలను ఇప్పటికే క్షుణ్ణంగా పరిశీలించి, అత్యవసరంగా తనిఖీ చేశామని, ప్రయాణికుల భద్రతే తమ ముఖ్యమని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు కూడా ఢిల్లీ మీడియా సమావేశంలో వెల్లడించారు. బోయింగ్ 787 విమానాలపై విస్తృత నిఘా పెంచాలని DGCA కూడా ఆదేశించింది.ఆ సిరిస్ చెందిన విమానాలు 34 ఉన్నాయి. 8 ఇప్పటికే తనిఖీ చేశామని త్వరలోనే మిగిలిన వాటిని అత్యంత నిఘా పరివేక్షణలో వాటిని పరిశీలిస్తామన్నారు.
బోయింగ్ డ్రీమ్ లైనర్పై నిఘా పొడిగింపు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES