- Advertisement -
నవతెలంగాణ – భిక్కనూర్
భిక్కనూర్ మండలం బిఆర్ఎస్ నాయకులు మంగళవారం మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ను హైదరాబాద్లోని ఆయన నివాసంలో పరామర్శించారు. అనంతరం ఆయన ఆరోగ్య విషయాలు అడిగి తెలుసుకున్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామాల్లోని నాయకులు పార్టీని ముందుండి నడిపించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉపసర్పంచ్ నరేష్, మాజీ ఎంపీటీసీ సాయి రెడ్డి, సొసైటీ చైర్మన్ వెంకట్ రెడ్డి, మాజీ సర్పంచ్ మధుసూదన్ రెడ్డి, నాయకులు సురేందర్ రెడ్డి, జీవన్ రెడ్డి, దేవేందర్ రెడ్డి, మాజీ వార్డు సభ్యులు భానుచందర్, రవి, చంద్రం, పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు ఉన్నారు.
- Advertisement -