- Advertisement -
నవతెలంగాణ – కామారెడ్డి : హైదరాబాద్లో గురువారం మందకృష్ణ మాదిగ కు జరిగే ఆత్మీయ సన్మాన సభకు కామారెడ్డి నుండి వికలాంగుల హక్కుల పోరాట సమితి నాయకులు బయలుదేరి వెళ్లారు. బడుగు, బలహీన వర్గాలు, వికలాంగుల హక్కుల కోసం అలుపెరగని పోరాటాలు చేస్తున్న మందకృష్ణ మాదిగను పద్మశ్రీ అవార్డు వరించడంతో ఆయనకు హైదరాబాద్లో నిర్వహించే ఆత్మీయ సన్మాన సభకు కామారెడ్డి జిల్లా నుండి వికలాంగుల హక్కుల పోరాట సమితి బయలుదేరి వెళుతున్నట్లు జిల్లా అధ్యక్షులు బాలరాజ్ గౌడ్ కూడా తెలిపారు.
- Advertisement -