Monday, June 23, 2025
E-PAPER
Homeజాతీయందేశవ్యాప్తంగా కొనసాగుతున్న ఉపఎన్నికల కౌంటింగ్

దేశవ్యాప్తంగా కొనసాగుతున్న ఉపఎన్నికల కౌంటింగ్

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : దేశవ్యాప్తంగా ఉప ఎన్నికల లెక్కింపు కొనసాగుతోంది. గుజరాత్, కేరళ, పంజాబ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు జరగ్గా ఆయా పార్టీలు ముందంజలో ఉన్నాయి. కేరళలోని నిలంబూర్‌లో కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్) ముందంజలో ఉండగా, పంజాబ్‌లోని లూధియానా వెస్ట్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఆధిక్యంలో ఉంది. పశ్చిమబెంగాల్‌లోని కలిగంజ్‌లో తృణమూల్ కాంగ్రెస్ ఆధిక్యంలో ఉండగా, గుజరాత్‌లోని కడీ, విసావదార్ నియోజకవర్గాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉంది. నాలుగు రాష్ట్రాల్లోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు సోమవారం ప్రారంభమైంది. జూన్ 19న గుజరాత్‌లోని కడీ, విసావదార్, పంజాబ్‌లోని లుధియానా వెస్ట్, బెంగాల్‌లో కలిగంజ్, కేరళలో నిలంబూర్‌లో ఉప ఎన్నికలు జరిగాయి.పశ్చిమ బెంగాల్, కేరళలో వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీతో పాటు INDIA కూటమి ఆత్వవిశ్వాసానికి పరీక్షగా మారనున్నాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పరాజయం తర్వాత నిశ్శబ్దంగా ఉన్న ఆప్ ప్రదర్శనపై గుజరాత్, పంజాబ్‌లో చూపిన స్పందన కీలకంగా మారనుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -