నవతెలంగాణ-హైదరాబాద్: నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఉపఎన్నికల ఫలితాల్లో అధికార పార్టీ బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. బీజేపీ పై ఆప్ బలపర్చిన అభ్యర్థి 17 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఘన విజయం సాధించారు. గుజరాత్ రాష్ట్రంలోని విసావదర్ నియోజవర్గంలో AAP అభ్యర్థి గోపాల్ ఇటాలియా, BJP అభ్యర్థి కిరీట్ పటేల్పై 17 రౌండ్ల లెక్కింపు తర్వాత 14,404 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.. గతంలో AAP గుజరాత్ అధ్యక్షుడైన ఇటాలియా, రెండవ రౌండ్లో 391 ఓట్లు, మొదటి రౌండ్లలో 5,500 ఓట్లు, 12వ రౌండ్లో 7,232 ఓట్ల ఆధిక్యత సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి నీతిన్ రన్పరియా పూర్తిగా వెనుకబడ్డారు. AAP ఎమ్మెల్యే భూపేంద్ర భయానీ రాజీనామా చేసి BJPలో చేరడంతో ఈ ఉప ఎన్నిక అనివార్యమైంది.
అదే విధంగా పంజాబ్ లోని ఆప్ ప్రభుత్వం తన పట్టును నిలుపుకుంది. లూధియానా వెస్ట్ నియోజవర్గంలో నుంచి AAP అభ్యర్థి సంజీవ్ అరోరా, కాంగ్రెస్ అభ్యర్థి భరత్ భూషణ్ ఆశును 4,751 ఓట్ల తేడాతో ఓడించి ఉప ఎన్నికలో విజయం సాధించారు. కేంద్ర ఎన్నికల సంఘం అధికారిక ట్రెండ్స్ ప్రకారం.. మొదటి రౌండ్లో 1,269 ఓట్లు, ఆరో రౌండ్లో 2,286 ఓట్లు, తర్వాత 4,748 ఓట్ల ఆధిక్యత సాధించారు. BJP జీవన్ గుప్తా మూడవ స్థానంలో, షిరోమణి అకాలీ దళ్ అభ్యర్థి పరుప్కార్ సింగ్ ఘుమ్మన్ నాలుగో స్థానంలో నిలిచారు. AAP MLA గుర్ప్రీత్ బస్సీ గోగి మరణంతో ఈ ఉప ఎన్నిక జరిగింది. కేరళ రాష్ట్రం నీలంబూర్ నియోజవర్గం నుంచి కాంగ్రెస్ నేతృత్వంలోని UDF అభ్యర్థి ఆర్యదన్ షౌకత్, CPI(M) అభ్యర్థి ఎం.స్వరాజ్ను 11,077 ఓట్ల తేడాతో ఓడించి విజయం సాధించారు.
కేరళ (Kerala)లోని నీలంబర్, పంజాబ్ లోని లూథియానా వెస్ట్, పశ్చిమ బెంగాల్ (West Bengal)లోని కాలిగంజ్, గుజరాత్ (Gujrat)లోని విశావదర్, కాడి నియోజకవర్గాలకు ఇటీవల ఉప ఎన్నికలు నిర్వహించగా..మరో రెండు స్థానాలకు కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది.