Tuesday, June 24, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఇరాన్ పై అమెరికా దాడిని ఖండించండి

ఇరాన్ పై అమెరికా దాడిని ఖండించండి

- Advertisement -

కొత్తపల్లి శివకుమార్ సీపీఐ(ఎం.ఎల్)మాస్ లైన్ జిల్లా కార్యదర్శి
నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
: ఇరాన్ దేశంపై అమెరికన్ సామ్రాజ్యవాదులు చేసిన యుద్ధ దాడిని ప్రపంచ ప్రజలందరూ ముక్తకంఠంతో ఖండించాలని సీపీఐ (ఎం.ఎల్) మాస్ లైన్ సూర్యాపేట జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఇరాన్ పై అమెరిక, ఇజ్రాయెల్ దాడులకు నిరసనగా సోమవారం జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ వద్ద సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నల్లజెండాలతో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ మార్కెట్ను జయించడం కోసం అమెరికన్ సామ్రాజ్యవాదులు తమ తొత్తు ప్రభుత్వాలను ఆసరా చేసుకొని మిగతా ప్రపంచ దేశాలపై దాడులకు దిగుతూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఆసియా ఖండంలో పట్టు సాధించడం కోసం ఇజ్రాయిల్, పాకిస్తాన్,దక్షిణ కొరియాలను స్థావరాలుగా ఏర్పరచుకొని తనను ఎదిరించిన దేశాలపై యుద్ధాలు చేస్తుందని ఆయన అన్నారు. ఒక కుక్కను చంపాలంటే దాన్ని పిచ్చికుక్కగా ప్రచారం చేయాలనేది సామెత. ఈ సామెత ఆధారంగా అమెరికా ఇజ్రాయిల్ కలిసి ఇరాన్ వద్ద అనుబాంబులు ఉన్నాయంటూ గత కొంతకాలంగా గోబెల్స్ ప్రచారం చేస్తూ ఇప్పుడు దాడులకు దిగారని ఆరోపించారు. అమెరికన్ సామ్రాజ్యవాదులకు ఇది వెన్నతో పెట్టిన విద్య అని, గతంలో సద్దాం హుస్సేన్ తదితరులు అందర్నీ కూడా ఈ విధంగా ప్రచారం చేసి చంపాలని కుట్రలు చేసిందని ఆరోపించారు. అను బాంబులు ఉంటే యుద్ధాలు చేయాలనుకుంటే మరి ప్రస్తుతం పాకిస్తాన్ దగ్గర వందల కొలది అనుబాంబులు ఉన్నాయని అమెరికానే చెప్పింది అని,మరి వారి మీద ఎందుకు యుద్ధం చేయట్లేదని ప్రశ్నించారు? దీని అర్థం అను బాంబులు కాదని తన చెప్పు చేతుల్లో ఉండని దేశాలను ఈ విధంగా బెదిరిస్తున్నారని ఆరోపించారు.అందుకే భారత ప్రభుత్వం ఇజ్రాయిల్ తో దౌత్య సంబంధాలను తెగదెంపులు చేసుకోవాలని డిమాండ్ చేశారు. ఇజ్రాయిల్ అమెరికన్ సంయుక్త కుట్రతో ఇరాన్ పై దాడి చేయడాన్ని ప్రపంచ ప్రజలు ముక్తకంఠంతో ఖండించాలని కోరారు.ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ పార్టీ జిల్లా నాయకులు కారింగుల వెంకన్న, పిఓడబ్ల్యు జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి రేణుక, పిడిఎస్యు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎర్ర అఖిల్ కుమార్, ఎఐపికెఎంఎస్ రాష్ట్ర నాయకులు పేర్ల నాగయ్య, పిఓడబ్ల్యు జిల్లా ఉపాధ్యక్షులు సూరం రేణుక,పార్టీ డివిజన్ నాయకులు ఎస్కే.సయ్యద్, టియుసీఐ జిల్లా కోశాధికారి ఐతరాజు వెంకన్న, జిల్లా నాయకులు శేషగిరి, పిఓడబ్ల్యు జిల్లా నాయకులు ఐతరాజు పద్మ, కల్పన, పజ్జూరి రేణుక, అరుణ, పివైఎల్ నాయకులు కట్ట రమేష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -