సస్పెండ్ ఉత్తర్వులు జారీచేసిన ఎస్పీ యం. రాజేష్ చంద్ర
నవతెలంగాణ – కామారెడ్డి : పెద్దకొడప్గల్ పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న కానిస్టేబుల్ రవికుమార్ అనేక సార్లు అధికారులకు తెలియకుండా విధులకు గైర్హాజరయ్యాడు. అంతేకాకుండా విధుల్లో ఉన్న సమయములో వారంట్లను, ఏఎస్ఐ సంతకాలను ఫోర్జరీ చేసి వాడుకుని, వాటిని దుర్వినియోగం చేశాడు. విధులకు గైర్హాజరైనప్పుడు పై అధికారులైన ఎస్సై సంతకాలను కూడా ఫోర్జరీ చేశాడు. తప్పుడు నివేదికలు పంపిచడం వంటి ఆరోపణలపై బాన్సువాడ డిఎస్పీ నివేదికను పరిశీలించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర తీవ్రంగా పరిగణించాడు. ప్రస్తుతం దేవునిపల్లి పోలీసు స్టేషన్ నందు విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ ను సస్పెoడ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఎవరైనా బాధ్యతారాహిత్య ప్రవర్తన లేదా చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడిన వారిపై శాఖ పరమైన చర్యలు తప్పవని ఈ సందర్బంగా ఎస్పీ హెచ్చరించారు.
ఎస్సై సంతకం ఫోర్జరీ..కానిస్టేబుల్ సస్పెండ్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES