నవతెలంగాణ-హైదరాబాద్ : మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం తెల్లవారుజామున తల్లిని కూతురు తన ప్రియుడితో కలిసి హత్య చేసింది. ఎన్ ఎల్ బి నగర్ లో అంజలి(39) కుటుంబ సభ్యులు నివాసం ఉంటున్నారు. అంజలి కూతురు తేజశ్రీ(16) ప్రస్తుతం పదోతరగతి చదువుతోంది. ప్రేమ వ్యవహారం తల్లికి తెలియడంతో పలుమార్లు కూతురును మందలించింది. తన ప్రేమకు తల్లి అడ్డుగా ఉండడంతో హత్య చేయాలని ప్లాన్ వేసింది. బాలిక తన ప్రియుడు శివ(19)తో కలిసి తల్లి గొంతు నులిమి, తలపై కొట్టి హత్య చేసింది. శివకు తోడుగా అతడు తమ్ముడు యశ్వంత్ కూడా హత్యలో పాలుపంచుకున్నాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. గతంలో శివతో తేజశ్రీ పారిపోయినట్టు అంజలి బంధువులు ఆరోపణలు చేస్తున్నారు.
ప్రియుడితో కలిసి తల్లిని హతమార్చిన బాలిక
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES