నవతెలంగాణ – హైదరాబాద్: మెక్సికోకు వేలాది వాహనాలను రవాణా చేస్తున్న ఓ భారీ కార్గో నౌక అగ్నిప్రమాదానికి గురైన కొన్ని వారాల అనంతరం ఉత్తర పసిఫిక్ మహాసముద్రంలో మునిగిపోయింది. ఈ నౌకలో సుమారు 800 ఎలక్ట్రిక్ వాహనాలతో పాటు మొత్తం 3,000 కొత్త వాహనాలు ఉన్నట్లు సమాచారం. లండన్కు చెందిన జోడియాక్ మారిటైమ్ అనే సంస్థ ‘మార్నింగ్ మిడాస్’ అనే ఈ నౌక నిర్వహణ వ్యవహారాలు చూస్తోంది. అలస్కాలోని అలూషియన్ దీవుల సమీపంలో అంతర్జాతీయ జలాల్లో ఈ దుర్ఘటన చోటుచేసుకుందని సంస్థ వెల్లడించింది. అసోసియేటెడ్ ప్రెస్ (ఏపీ) కథనం ప్రకారం.. మంటల వల్ల జరిగిన నష్టం, ప్రతికూల వాతావరణం, నౌకలోకి నీరు చేరడం వంటి కారణాలతో తీరానికి 415 మైళ్ల దూరంలో, సుమారు 16,404 అడుగుల లోతున నౌక మునిగిపోయింది. ఈ ఘటన అనంతరం ఆ ప్రాంతంలో ఇప్పటివరకు ఎలాంటి కాలుష్య ఆనవాళ్లు కనిపించలేదని యూఎస్ కోస్ట్ గార్డ్ ప్రతినిధి, ఆఫీసర్ కామెరాన్ స్నెల్ తెలిపారు.
పసిఫిక్ మహాసముద్రం పాలైన 3 వేల వాహనాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES