నవతెలంగాణ – హైదరాబాద్ : ఛత్తీస్గఢ్లోని నారాయణపుర్ జిల్లాలో మావోయిస్టులు, భద్రతా దళాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఇద్దరు మహిళా మావోయిస్టులు మృతి చెందినట్లు ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (బస్తర్ రేంజ్) పి. సుందర్రాజ్ తెలిపారు. ఈ ఆపరేషన్ను జిల్లా రిజర్వ్ గార్డ్స్ నారాయణపూర్, కొండగావ్, స్పెషల్ టాస్క్ ఫోర్స్ సంయుక్తంగా నిర్వహించినట్లు తెలిపారు. బుధవారం సాయంత్రం నుంచి జరుగుతున్న ఎన్కౌంటర్లో ఇద్దరు మహిళా మావోయిస్టుల మృతదేహాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయన్నారు. ఒక ఇన్సాస్ రైఫిల్తో పాటు వైద్య పరికరాలు, ఇతర సామగ్రిని బలగాలు స్వాధీనం చేసుకున్నాయని, ప్రస్తుతం ఆ ప్రాంతంలో సెర్చింగ్ ఆపరేషన్ కొనసాగుతున్నట్లు తెలిపారు.
ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్.. ఇద్దరు మహిళా మావోయిస్టులు మృతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES