నవతెలంగాణ-హైదరాబాద్ : విమానాలకు బాంబు బెదిరింపులు కొనసాగుతున్నాయి. తాజాగా ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపులు వచ్చాయి. విమానంలో బాంబు ఉందంటూ గుర్తుతెలియని వ్యక్తులు బెదిరింపులకు పాల్పడ్డారు. శుక్రవారం ఉదయం ఢిల్లీలోని టెర్మినల్ 3 వద్ద ఉన్న విమానానికి ఈ బెదిరింపులు వచ్చాయి. విమానంలోని క్యాబిన్లో ‘ఎయిర్ ఇండియా 2948 @ T3లో బాంబు ఉంది’ అనే సందేశంతో కూడిన టిష్యూ పేపర్ను సిబ్బంది గుర్తించారు. వెంటనే అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో అప్రమత్తమైన అధికారులు విమానంలో తనిఖీలు చేపట్టారు. అయితే, ఈ తనిఖీల్లో ఎలాంటి పేలుడు పదార్థాలూ, అనుమానాస్పద వస్తువులూ లభించలేదు. ఇది బూటకపు బెదిరింపుగా అధికారులు తేల్చారు.ఈ మేరకు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఎయిర్ ఇండియా విమానంలో బాంబు..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES