బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబోలో రూపొందుతున్న చిత్రం ‘అఖండ 2: తాండవం’. 14 రీల్స్ ప్లస్ బ్యానర్పై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట అత్యంత భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎం.తేజస్విని నందమూరి సమర్పిస్తున్నారు. మేకర్స్ బుధవారం జననిగా హర్షాలీ మల్హోత్రా ఫస్ట్ లుక్ను రిలీజ్ చేశారు. సల్మాన్ ఖాన్ ‘భజరంగీ భాయిజాన్’లో చైల్డ్ ఆర్టిస్ట్గా కనిపించిన హర్షాలీ మల్హోత్రా ఈ చిత్రంతో టాలీవుడ్లోకి అడుగుపెడుతోంది. ఈ చిత్ర టీజర్కు నేషనల్ వైడ్గా ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. టీజర్లో బాలకృష్ణ మునుపెన్నడూ చూడని అవతార్లో కనిపించారు.
సంయుక్త ఈ చిత్రంలో హీరోయిన్గా నటిస్తుండగా, ఆది పినిశెట్టి పవర్ ఫుల్ క్యారెక్టర్ని పోషిస్తున్నారు. దసరా కానుకగా సెప్టెంబర్ 25న భారీ స్థాయిలో పాన్ ఇండియా రిలీజ్ కానుంది అని మేకర్స్ తెలిపారు.
ఈ చిత్రానికి రచన, దర్శకత్వం: బోయపాటి శ్రీను, నిర్మాతలు: రామ్ ఆచంట, గోపి ఆచంట, ప్రజెంట్స్: ఎం తేజస్విని నందమూరి, సంగీతం: థమన్ ఎస్, డీవోపీ: రాంప్రసాద్, సంతోష్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కోటి పరుచూరి, ఆర్ట్: ఏఎస్ ప్రకాష్, ఎడిటర్: తమ్మిరాజు, ఫైట్స్: రామ్-లక్ష్మణ్
‘అఖండ 2’లో జననిగా..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES