Friday, July 4, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంపాక్ సోషల్ మీడియా ఖాతాలు భారత్‌లో బ్యాన్

పాక్ సోషల్ మీడియా ఖాతాలు భారత్‌లో బ్యాన్

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్‌కు చెందిన ఛానల్స్, సోషల్ మీడియా ఖాతాలపై భారత ప్రభుత్వం బ్యాన్ విధించింది. అయితే తిరిగి భారత్‌లో ప్రత్యక్షమయ్యాయి. దీంతో అప్రమత్తమైన కేంద్రం.. తాజాగా పాక్ సోషల్ మీడియా ఖాతాలను భారత్ నిషేధించింది. హనియా అమీర్, షాహిద్ అఫ్రిది, మహీరా ఖాన్‌ల‌తో అనేక మంది పాకిస్థాన్‌ ప్రముఖుల ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్‌ను బ్యాన్ చేశాయి. దీంతో వారి ఖాతాలు భారతీయులకు నిలిచిపోయాయి.

ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్ర దాడిలో 26 మంది చనిపోయారు. అనంతరం భారతప్రభుత్వం.. పాకిస్థాన్‌పై ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. ఈ ఆపరేషన్‌పై పాకిస్థాన్ సెలబ్రిటీలు లేనిపోని వార్తలు సృష్టించారు. దీంతో వెంటనే పాకిస్థాన్ యూట్యూబ్ ఛానళ్లు, సోషల్ మీడియాలో ఖాతాలను బ్యాన్ చేశారు. ఉన్నట్టుండి బుధవారం భారత్‌లో తిరిగి ప్రత్యక్షమయ్యాయి. దీంతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో అలజడి రేగింది. తిరిగి పాకిస్థాన్ ఛానల్స్‌ను భారత్ పునరుద్ధరించిందంటూ ప్రచారం జరిగింది. దీనిపై భారతప్రభుత్వం క్లారిటీ ఇవ్వలేదు. తాజాగా వాటిన్నింటిపైనా బ్యాన్ విధించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -