- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ ఉదయం 10.30కి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి నేరుగా ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ పర్యటనలో భాగంగా రెండు రోజుల పాటు అక్కడే ఉండి ఆయన పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నట్లుగా తెలుస్తోంది. హైదరాబాద్ మెట్రో రైల్ రెండో దశ విస్తరణ పనులకు సంబంధింది DPR, రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణాలకు కేంద్ర స్థాయిలో మద్దతు పొందడమే లక్ష్యంగా చర్చలు జరపనున్నారు.
- Advertisement -