Wednesday, July 9, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సార్వ‌త్రిక‌ సమ్మెను ట్రాన్స్ పోర్ట్ కార్మికులు జ‌య‌ప‌ద్రం చేయాలి

సార్వ‌త్రిక‌ సమ్మెను ట్రాన్స్ పోర్ట్ కార్మికులు జ‌య‌ప‌ద్రం చేయాలి

- Advertisement -
  • ఆటో యూనియన్ జిల్లా అధ్యక్షులు కటారి రాములు
    నవతెలంగాణ-కంఠేశ్వర్: ట్రాన్స్ పోర్ట్ కార్మికులను కఠినంగా శిక్షించే హిట్ అండ్ BNS సెక్షన్ 106(1)(2) రద్దు చేయాల‌ని, జులై 9న జరిగే దేశవ్యాపిత సమ్మెలో ట్రాన్స్ పోర్ట్ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఆటో యూనియన్ జిల్లా అధ్యక్షులు కటారి రాములు పిలుపునిచ్చారు. ఏ మేరకు మంగళవారం కాకతీయ స్కూల్ వద్ద ఆటో యూనియన్ ఆధ్వర్యంలో సమ్మె బుక్ లైట్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆటో యూనియన్ జిల్లా అధ్యక్షులు కటారి రాములు మాట్లాడుతూ..రోడ్ ప్రమాదాలు తగ్గాలంటే డ్రైవర్ లను కఠినంగా శిక్షించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన హిట్ అండ్ రన్ BNS సెక్షన్ 106 (1(2) లను రద్దు చేయాలని కటారి రాములు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇండియన్ పీనల్ కోడ్ స్థానంలో తీసుకొచ్చిన భారత న్యాయ సంహిత (BNS) చట్టంలోని సెక్షన్ 106(1)(2) ల ప్రకారం రోడ్ ప్రమాదాలు జరగడానికి డ్రైవర్ లే కారణమని భావించి డ్రైవర్ లను కఠినంగా శిక్షించాలని 10 సంవత్సరాలు జైలు శిక్ష, ఏడు లక్ష రూపాయల ఫైన్ విధించే విధంగా తీసుకొచ్చిన సెక్షన్ ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

రవాణా రంగ కార్మికులు నిత్యం ప్రమాదాలకు గురౌతున్నారని, కుటుంబాలు ఆర్థికంగా చితికి పోతున్నాయని కార్మికులను అదుకోవడం కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రోడ్ ప్రమాదాలలో మరణించిన, గాయపడిన ప్రమాద బీమా కంపనీల ద్వారా గతంలో బీమా వచ్చెదని నేడు బీమాపై కేంద్రం సిలింగ్ పెట్టి డ్రైవర్ లపైన ఫెనాల్టీ ఏడు లక్షల రూపాయలని వేసి కార్మికులకు నష్టం చేసే నూతన మోటారు వాహన చట్టం-2019ని సవరించాలని, కార్మిక హక్కులను కాలరాసే, పని గంటలు పెంచే నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని ఇతర కార్మిక డిమాండ్స్ పై జులై 9న జరిగే దేశవ్యాపిత సమ్మెలో ట్రాన్స్ పోర్ట్ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో కృష్ణ, మల్లేష్, సయ్యద్ రఫీ యుద్దీన్, సయ్యద్ ఇర్ఫాన్, షేక్ జావిద్, షేక్ మసూద్, షేక్ మజీద్ పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కార్మికులకు పిలుపునిచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -