- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : కూకట్పల్లిలో దారుణం జరిగింది. కూకట్పల్లిలో కల్తీ కల్లు తాగి 15 మందికి అస్వస్థత చోటు చేసుకుంది. దింతో అస్వస్థతకు గురైన వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని రాందేవ్ ఆసుపత్రికి తరలించారు అధికారులు. ఇక చికిత్స పొందుతున్న వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిపారు ఎక్సైజ్ అధికారులు.
చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు కూకట్పల్లిలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. కల్తీ కల్లు విక్రయిస్తున్న కల్లు దుకాణం నడిపించేది శేరిలింగంపల్లి కాంగ్రెస్ నాయకుడని ఆరోపించారు మాధవరం కృష్ణారావు.
- Advertisement -