- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: నూతన కార్మిక చట్టాలు, ప్రయివేటీకరణ చర్యల్ని వ్యతిరేకిస్తూ దేశ వ్యాప్తంగా చేపట్టిన సమ్మెలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో వామపక్షాల నాయకులు, కార్యకర్తలు ఆర్టీసీ బస్సులను అడ్డుకున్నారు. ఉదయం నుంచి ఆర్టీసీ బస్టాండ్ ఎదుట బైఠాయించి బస్సులు బయటకు వెళ్లకుండా నిలిపివేశారు. సార్వత్రిక సమ్మెలో సీపీఐ(ఎం), సీపీఐ, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కార్మికుల పనిగంటలు మార్చాలనే ఆలోచన విరమించుకోవాలని డిమాండ్ చేశారు.

- Advertisement -