నవతెలంగాణ – మునుగోడు : కార్మికులకు నష్టం కలిగించే 4 లేబర్ కోడ్ ల ను వెంటనే రద్దు చేయాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. బుధవారం మునుగోడు మండల కేంద్రంలో అఖిలభారత సార్వత్రిక సమ్మె పిలుపుమేరకు సిఐటియు, ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన అన్నారు. ప్రజల కష్టార్జితంతో నిర్మించుకున్న ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేట్ కార్పొరేట్ శక్తులకు అప్ప చెప్పవద్దని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కార్మికులకు 10 గంటలు పని చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం జీవో జారీ చేయడంపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. కార్మిక వర్గం సమరశీల పోరాటాల ద్వారా 100 సంవత్సరాలలో సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దుచేసి వాటి స్థానంలో నాలుగు లేబర్ కోడ్ లను ముందుకు తెచ్చిందని ఆయన అన్నారు. కేంద్ర బిజెపి ప్రభుత్వ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను వెనక్కి కొట్టేందుకు భారత రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను కాపాడుకునేందుకు పోరాటాలు నిర్వహించాలని ఆయన కార్మికులకు పిలుపునిచ్చారు. కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, చాలీచాలని జీతాలతో కార్మికులు జీవనోపాధి కొనసాగిస్తున్నారని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కన్వీనర్ వరికుప్పల ముత్యాలు, డివైఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి కట్ట లింగస్వామి , మండల కమిటీ సభ్యులు యాస రాణి శ్రీను, వేముల లింగస్వామి, వడ్లమూడి హనుమయ్య,యాట యాదయ్య, కొంక రాజయ్య, సిఐటియు అధ్యక్షులు రాజీవ్ ,ఉపాధ్యక్షులు లక్ష్మయ్య, జీడిమడ్ల దశరథ ,ప్రధాన కార్యదర్శి బుడిగపాక లింగస్వామి,సహాయ కార్యదర్శి అరుణ ,జలంధర్, కార్యదర్శులు శివశంకర్ ,సంజీవ ,లింగయ్య ,కోశాధికారి వంపు యాదయ్య , సుజాత సునీత సంధ్యారాణి లింగయ్య ,ఆశ యూనియన్ వి నిర్మల ,కవిత ,లక్ష్మి, కమలమ్మ ,లింగమ్మ, కమల తదితరులు పాల్గొన్నారు.
నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలి: సీపీఐ(ఎం)
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES