- Advertisement -
నవతెలంగాణ – నాగిరెడ్డిపేట్ : తమ న్యాయమైన డిమాండ్లు వెంటనే పరిష్కరించాలని కోరుతూ మధ్యాహ్న భోజన కార్మికులు బుధవారం రోజు మండల కేంద్రంలో గల జాతీయ రహదారిపై ధర్నా రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశవ్యప్త సమ్మెలో భాగంగా నాగిరెడ్డి పేటలో మండల వ్యాప్తంగా ఉన్న 32 మధ్యాహ్న భోజన ఏజెన్సీలు బుధవారం రోజు నిలిపివేయడం జరిగిందని వారు పేర్కొన్నారు. అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని తాసిల్దార్ శ్రీనివాసరావుకు అందజేశారు. కార్యక్రమంలో మండల భోజన ఏజెన్సీ నిర్వాహకులు పాల్గొన్నారు.
- Advertisement -