Thursday, July 10, 2025
E-PAPER
Homeజిల్లాలుములుగు మార్కెట్ కమిటీ చైర్మన్ గా రేగ కళ్యాణి ప్రమాణ స్వీకారం.. 

ములుగు మార్కెట్ కమిటీ చైర్మన్ గా రేగ కళ్యాణి ప్రమాణ స్వీకారం.. 

- Advertisement -

నవతెలంగాణ – తాడ్వాయి 
ములుగు జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా తాడ్వాయి మండలం కామారం (పిటి) గ్రామానికి చెందిన ఆదివాసి ముద్దుబిడ్డ రేగ కళ్యాణి బుధవారం ప్రమాణస్వీకారం చేశారు. ములుగు జిల్లా కేంద్రంలో లీలా గార్డెన్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క నేతృత్వంలో నూతన చైర్మన్గా కళ్యాణి తో పాటు 11 మంది సభ్యులు డైరెక్టర్లు గా ప్రమాణస్వీకారం చేశారు. డైరెక్టర్లుగా సేద సారంగం, రసపుత్ సీతారాం, కొమురం బాలయ్య, లక్కీ వెంకన్న, ముక్తి రామస్వామి, చెరప పగడయ్య, పోరిక ప్రమీల, పాలకుర్తి సమ్మయ్య, అర్రెం వెంకన్న, ఆలోత్ దేవ్ సింగ్, పెద్ది రాజకుమార్ తదితరులు ప్రమాణ స్వీకారం చేశారు.

చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన రేగ కళ్యాణి మాట్లాడుతూ.. ములుగు జిల్లా వ్యాప్తంగా ఉన్న రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఉన్న, రైతుల సమస్యలను పరిష్కరిస్తానన్నారు. ములుగు జిల్లా అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానన్నారు. నా ఎన్నికకు సహకరించిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ, మంత్రి సీతక్కకు, జిల్లా మండల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్ గ్రంథాలయ చైర్మన్ బానోతు రవిచందర్, ములుగు, వెంకటాపూర్, గోవిందరావుపేట, తాడ్వాయి, ఏటూరు నాగారం, కన్నాయిగూడెం, వాజేడు, వెంకటాపూర్, మంగపేట మండలాల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, నాయకులు, ప్రజాప్రతినిధులు, మేధావులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -