Saturday, July 12, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఆదివాసీల సాంప్రదాయాలు దెబ్బ తినకుండా ఘనంగా ఏర్పాట్లు

ఆదివాసీల సాంప్రదాయాలు దెబ్బ తినకుండా ఘనంగా ఏర్పాట్లు

- Advertisement -

సమ్మక్క సారలమ్మ ఘణ కీర్తి ప్రపంచవ్యాప్తంగా తెలియజేయడానికి ఏర్పాటు
జాతర సందర్భంగా భక్తులకు ఇబ్బందులు 
కలగకుండా చర్యలు తీసుకుంటాం
రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క
నవతెలంగాణ – తాడ్వాయి                     

వచ్చే సంవత్సరం జనవరి 28 నుండి  31వ తేదీ వరకు జరుగనున్న   సమ్మక్క-  సారలమ్మ మేడారం మహా జాతర వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేస్తామని, ఆదివాసి  సాంప్రదాయాలు దెబ్బ తినకుండా  చర్యలు తీసుకుంటామని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. శుక్రవారం ములుగు మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ భానోత్ రవిచందర్ లతో కలిసి  మండలం మేడారంలోని సమ్మక్క సారలమ్మలను దర్శించుకున్నారు.

పూజారులు, ఎండోమెంట్ అధికారులు ఆదివాసి సంప్రదాయాల ప్రకారం డోలు వాయిద్యాల మధ్య ఘనంగా స్వాగతం పలికారు. సమ్మక్క- సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు వనదేవతలకు ఇష్టమైన పసుపు కుంకుమ చీరే సారే సమర్పించి ప్రత్యేక మొక్కులు చెల్లించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ..సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు, జంపన్న ఘణ కీర్తిలను ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పే విధంగా చర్యలు తీసుకుంటామని వివరించారు. వేల సంవత్సరాల పాటు నిలిచిపోయేలా  సమ్మక్క సారలమ్మ ప్రాంగణాన్ని సుందరంగా తీర్చిదిద్దడం జరుగుతుందని, ఇప్పటికే జాతరలో శ్వాశత  పనులు జరుగుతుండగా మరో 112 కోట్ల రూపాయలతో  సౌకర్యాల కల్పన కోసం ప్రభుత్వానికి అంచనాలు తయారు చేసి నివేదిక సమర్పించడం జరిగిందని అన్నారు. మేడారం మహా జాతరను విజయవంతం చేయడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారని, జాతరకు కావలసిన నిధులను వెంటనే మంజూరు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు.

క్యూ లైన్ విస్తరణ  పనులు కొనసాగుతున్నాయని, జాతర విజయవంతానికి, జిల్లా యంత్రాంగం ముందస్తు ప్రణాళికతో సమన్వయంగా  ముందుకు సాగాలని సూచించారు. జంపన్న వాగుపై ఇరువైపులా భక్తులు సేద తీరడానికి అహాలదకరంగా ఉండే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామని, గిరిజన పూజారుల సాంప్రదాయానికి  విగాధం(అంతరాయం) కలగకుండా పూజార్ల ఆలోచన విధానంతోనే ముందుకు సాగుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి, గ్రంథాలయ చైర్మన్ భానోత్ రవిచంద్ర, అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు సంపత్ రావు, మేడారం ఈ ఓ మేకల వీరస్వామి, పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గరావు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బొలు దేవేందర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మిగతా పూజారులు, సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -