- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు : మండలంలోని తాడిచర్ల ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి ఎం.వినయ్ భాస్కర్ ఆధ్వర్యంలో శుక్రవారం మల్లారం గ్రామంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో వివిధ రోగాలకు పాల్గొన్నారు. 4 మంది రోగులకు షుగర్,బీపీ,డెంగ్యూ,మలేరియా తదితర వైద్య పరీక్షలు నిర్వహించి,రోగుల సంబంధిత టెస్టులు చెసి వారిని ఈహెచ్ఎంఐఎస్,ఓపిడి ఎంటర్ చేసి వారికి సంబధించిన మందులు ఇవ్వడం జరిగిందన్నారు. అలాగే వర్షా కాలం సీజన్లో పాటించాల్సిన సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించారు. ఈ క్యాంపులో పంచాయతీ కార్యదర్శి చెలుకల రాజుయాదవ్,వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
- Advertisement -