- Advertisement -
నవతెలంగాణ-మద్నూర్ : మద్నూర్ ఎస్సై విజయ్ కొండాను రథంగల్లి యువకులు పోలీస్ స్టేషన్లో మర్యాదపూర్వకంగా బుధవారం కలిశారు. యువకులు మాట్లాడుతూ.. ఎస్సై విధుల పట్ల సాధించిన రెండు వెండి పథకాలు మండలానికి ఆదర్శంగా నిలుస్తాయని అన్నారు. ఈ నేపథ్యంలో యూవకులంతా కలిసి ఎస్సై ని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బొగ్గుల వార్ సంజు, చాట్ల వార్ హనుమాన్లు, అవార్వార్ హనుమాన్లు, రౌతు వార్ శంకర్, మానూర్ వార్ కిరణ్, పాకల్ వార్ యువకులు, తదితరులు పాల్గొన్నారు. అనంతరం యువకులకు ఎస్ఐ విజయ్ కొండ అభినందనలు తెలియజేశారు.
- Advertisement -