Sunday, July 20, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అక్షర పాఠశాలలో ఆషాఢ బోనాలు జాతర

అక్షర పాఠశాలలో ఆషాఢ బోనాలు జాతర

- Advertisement -

పండగలపై ప్రజలకు అవగాహన కల్పించడమే మా లక్ష్యం 
డైరెక్టర్స్ లోకేష్ రెడ్డి, సంగీతారెడ్డి
నవతెలంగాణ – కామారెడ్డి 

ఆషాఢ మాసం సందర్భంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అక్షర ఉన్నత పాఠశాలలో శనివారం ఉపాధ్యాయులు విద్యార్థులతో కలిసి ఘనంగా బోనాల ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అక్షరా పాఠశాల డైరెక్టర్స్ లోకేష్ రెడ్డి, సంగీతారెడ్డి లు మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులకు పండగ సంప్రదాయాలపై అవగాహన కలిగించేందుకు ప్రతి పండగ సందర్భంగా ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందన్నారు.

ఈ ఉత్సవాల్లో భాగంగా  అమ్మవారిని సంప్రదాయ బద్దంగా అలంకరించి భక్తి శ్రద్ధలతో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించారు.  ఉపాధ్యాయులు, విద్యార్థిని, విద్యార్థులు సంప్రదాయ దుస్తులు ధరించి ఉత్సవాల్లో పాల్గొన్నారు, డప్పు చప్పుళ్ళు విద్యార్థులు పోతరాజు వేషధారణ, సంప్రదాయ వస్త్రాలు పలువురిని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో విద్యా సంస్థ చైర్మన్ వెదిరె అశోక్ రెడ్డి,  ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -