- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: శంషాబాద్ నుండి తిరుపతికి బయలుదేరాల్సిన స్పైస్ జెట్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో ఆ విమాన సర్వీసును రద్దు చేశారు. తిరుపతికి వెళ్లాల్సిన స్పైస్ జెట్ ఎస్జీ – 2138 విమానం రన్ వేపై వెళ్తుండగా పైలట్ సాంకేతిక లోపాన్ని గుర్తించారు. వెంటనే పైలట్ సంబంధిత అధికారులకు సమాచారం అందించారు.
దీంతో తిరుపతికి వెళ్లాల్సిన ఈ విమానాన్ని రద్దు చేస్తున్నట్లు స్పైస్ జెట్ ఎయిర్ వేస్ అధికారులు ప్రకటించారు. ఈ విమానంలో తిరుపతికి వెళ్లాల్సిన 54 మంది ప్రయాణికులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా మరో విమానంలో పంపించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
- Advertisement -