Monday, July 21, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంహెచ్‌-1బీ జారీలో కీలక మార్పులు

హెచ్‌-1బీ జారీలో కీలక మార్పులు

- Advertisement -

– జీతం, పొజిషన్‌ ఆధారంగా వీసా
వాషింగ్టన్‌ :
అమెరికాలోని డోనాల్డ్‌ ట్రంప్‌ యంత్రాంగం హెచ్‌-1బీ వీసాల జారీ ప్రక్రియలో కీలక మార్పులకు సిద్ధమవుతున్నది. ఈ మేరకు డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హౌమ్‌ల్యాండ్‌ సెక్యూరిటీ ఓ ప్రతిపాదనను శ్వేతసౌధంలోని ఇన్ఫర్మేషన్‌ అండ్‌ రెగ్యూలేటరీ అఫైర్స్‌ ఫర్‌ రివ్యూ కార్యాలయానికి పంపింది. వాస్తవానికి ఎన్ని హెచ్‌-1బీ వీసాలు జారీ చేయాలనే చట్టపరమైన పరిమితిని ఏటా కాంగ్రెస్‌ నిర్ణయిస్తుంది. ప్రస్తుతం అది 85,000గా ఉంది. వీటిల్లో 20,000 వీసాలు మాస్టర్స్‌ డిగ్రీ ఉన్న వర్కర్ల కోసం రిజర్వు చేశారు. ఇక ఎటువంటి పరిమితి లేని వీసాలను విశ్వవిద్యాలయాల్లోని పరిశోధన విభాగాల కోసం జారీ చేస్తారు. 2026 కోసం వార్షిక పరిమితికి తగినన్ని దరఖాస్తులు రావడంతో ప్రాసెస్‌ను నిలిపివేసినట్టు యూఎస్‌ సిటిజన్‌షిప్‌ అండ్‌ ఇమిగ్రేషన్‌ సర్వీసెస్‌ ప్రకటించింది. దీంతో 2026 సంవత్సరానికి లాటరీ విధానం ఉండకపోవచ్చు. ప్రస్తుతం పరిమితి ఆధారంగా లాటరీ విధానంలో వీసా దారులను ఎంపిక చేస్తారు. ఈ ప్రక్రియ తర్వాత ఆయా కంపెనీలు తమకు వచ్చిన వీసాల్లో అక్టోబర్‌ నాటికి విధుల్లో చేరాల్సిన కార్మికుల దరఖాస్తులను సమర్పిస్తాయి. ట్రంప్‌ తొలివిడత అధికారంలోకి వచ్చాక.. లాటరీ విధానంలో కాకుండా.. సదరు పోస్టుకు ఆఫర్‌ చేస్తున్న వేతనం ఆధారంగా వీసాలు జారీ చేశారు. కంపెనీలు మరింత మంది ఉన్నత స్థాయి నిపుణులను నియమించుకొనేలా ప్రోత్సహించేందుకు ఈ విధానం అమలు చేసినట్టు తెలుస్తోంది. దీంతోపాటు తక్కువ శ్రేణి జీతాలున్న పొజిషన్లలో విదేశీయుల నియామకాలను నియంత్రిచేందుకు ఉపయోగపడింది. నాడు ‘బై అమెరికన్‌, హైర్‌ అమెరికన్‌’ అనే కార్యక్రమం కింద దీనిని నిర్వహించారు. 2021లో బైడెన్‌ అధికారంలోకి వచ్చాక దీనిని పక్కన పెట్టారు. ఇక తాజాగా డీహెచ్‌ఎస్‌ పంపిన ప్రతిపాదనపై దాదాపు 1,000 వరకు పబ్లిక్‌ కామెంట్లు వచ్చినట్టు బ్లూమ్‌బెర్గ్‌ రిపోర్ట్‌ చేసింది. దీని వల్ల హెచ్‌-1బీ ఉద్యోగులు తక్కువగా అందుబాటులో ఉంటారని పేర్కొంది. వాస్తవానికి ఏ కంపెనీకి అనుకూలంగా నిర్ణయాలు తీసుకోకుండా లాటరీ విధానాన్ని తీసుకొచ్చారు. కానీ, చాలా పెద్ద కంపెనీలు అధిక దరఖాస్తులు చేసి.. ఎక్కవ వీసాలను దక్కించుకొంటున్నాయి. ఈ ఏడాది జనవరిలో ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ప్రొగ్రెస్‌ అనే మేధోమథన సంస్థ ఈ లాటరీ విధానాన్ని తొలగించాలని సూచించింది. సీనియార్టీ, జీతం ఆధారంగా వీసాలు జారీ చేస్తే వాటి ఆర్థిక విలువ 88 శాతం పెరుగుతుందని వివరించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -