మా బాటలోనే కేంద్ర సర్కార్ : ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
కులగుణన సర్వే అవసరం లేదన్న మోడీని జనగణనతో పాటు కులగణన కూడా చేస్తామనేలా తెలంగాణ ప్రభుత్వం కృషి చేసిందని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. రాష్ట్ర ప్రభుతం పకడ్బందీగా, విజయవంతంగా కులగణన సర్వే పూర్తి చేసిందని గుర్తు చేశారు. ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వేకి ముందు, సర్వేకి తర్వాత అన్న చర్చ దేశవ్యాప్తంగా జరుగుతున్నదని అభిప్రాయపడ్డారు. కులగణన సర్వే చారిత్రాత్మకమైందని వ్యాఖ్యానించారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో సీఎం రేవంత్రెడ్డి నాయకత్వంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు అన్ని రాజకీయ పార్టీలు, లోక్సభ, రాజ్యసభ ఎంపీల మద్దతు కూడగట్టేందుకు ఢిల్లీకి వెళ్తున్నామని చెప్పారు.
మంగళవారం హైదరాబాద్లోని సచివాలయంలో మీడియాతో భట్టి మాట్లాడుతూ బీసీ బిల్లును త్వరితగతిన పార్లమెంట్లో ప్రవేశపెట్టి మద్దతు కూడగట్టడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ఈ కార్యక్రమానికి అఖిల భారత కాంగ్రెస్ పార్టీకి చెందిన 100 మంది ఎంపీలు కూడా కలిసి వస్తారని గుర్తు చేశారు. తెలంగాణలో అధికారంలోకి రాగానే కులగణన చేపడతామని మా నాయకుడు రాహుల్గాంధీ ఎన్నికల ముందు ప్రకటించారని గుర్తు చేశారు. ఆ మేరకు విజయవంతంగా కులగణన పూర్తి చేసి క్యాబినెట్లో, ఆ తర్వాత అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టి ఆమోదింపజేశామన్నారు. కులగణనలో తెలంగాణ దేశానికే ఒక రోల్ మోడల్గా నిలుస్తుందన్నారు. దేశంలోని ఏ రాష్ట్రమైనా కుల గణన చేపట్టాలంటే తెలంగాణ ప్రభుత్వాన్ని అనుసరించాల్సిందేనని అభిప్రాయపడ్డారు. గతంలో దేశంలో చేపట్టిన వివిధ రకాల సర్వేలు, వారి అనుభవాలను సైతం పరిగణనలోకి తీసుకున్నామని గుర్తు చేశారు. సర్వేకు సంబంధించిన ప్రశ్నావళి తయారీ విధానం, జిల్లా, రాష్ట్రస్థాయిలో భాగస్వాములందర్నీ సర్వేకు ముందే సమావేశపరిచి వారి అభిప్రాయాలను తీసుకుని ముందుకు వెళ్ళామన్నారు.
ప్రతి 150 ఇండ్లకు ఒక బ్లాక్, ప్రతి బ్లాక్కు ఒక అధికారిని నియమించామనీ, పూర్తిగా ప్రభుత్వ ఉద్యోగుల ఆధ్వర్యంలో సర్వే జరిగిందన్నారు. ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వే వివరాలను స్వతంత్ర అనుభవజ్ఞుల కమిటీతో కలిసి విశ్లేషణ చేయించామని తెలిపారు. పారదర్శకంగా, పకడ్బందీగా సర్వే పూర్తి చేసి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం పట్టుదలతో ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వేకు అసెంబ్లీలో బీజేపీ, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా మద్దతు ఇచ్చారనీ, పార్లమెంట్లోనూ పార్టీలకు అతీతంగా బీసీ బిల్లుకు మద్దతు ఇస్తారని రాష్ట్ర ప్రభుత్వం ఆశిస్తున్నదన్నారు. 50 శాతం రిజర్వేషన్ల క్యాప్ను తొలగించకపోతే భవిష్యత్తులో ఇబ్బంది కలుగుతుందనే ఆర్డినెన్స్ తీసుకువచ్చామనీ, ఆర్డినెన్స్కు గవర్నర్ ఆమోదముద్ర వేస్తారనే నమ్మకముందని వివరించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుకు దళితులు, బీసీలు, మైనార్టీలు అంటే చిన్న చూపు ఉందన్నారు. దేశంలో ఈ వర్గాలకు మేలు జరుగుతుంటే ఆయన పదేపదే అడ్డుపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రామచంద్రరావు పాత్ర ఏంటో అందరికీ తెలుసని వ్యాఖ్యానించారు. రిజర్వేషన్ల బిల్లు మేమే తెచ్చామనీ, మేమే పరిష్కరించుకోవాలని బీజేపీ అధ్యక్షుడు ప్రకటిం చారని వివరించారు.
వారు విషయాన్ని సరిగ్గా అవగాహన చేసుకోలేదని భావిస్తున్నానని వివరించారు. బీసీ రిజర్వేషన్ల బిల్లు అనేది కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అంశమనీ, రాజకీయ పార్టీలకు సంబంధించినది కాదన్నారు. భట్టి విక్రమార్క లీగల్ నోటీసులకు భయపడే వ్యక్తి కాదనీ, సమయం వచ్చినప్పుడు పార్టీగా, వ్యక్తిగా లీగల్ నోటీసులకు సమాధానం చెబుతానని అబి óప్రాయ పడ్డారు. స్వతంత్ర భారతదేశంలో ఇప్పటి వరకు ఈ పద్ధతిలో కులగణన జరగలేదన్నారు. కులగణనకు సంబంధించి కేంద్రం ఏ సమాచారమడిగినా, ఎప్పుడైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. కుల గణన విషయంలో అన్ని రకాల పరిణామాలను ఎదుర్కొనేందుకు ఒక పాజిటివ్ దక్పథంతో తెలంగాణ ప్రభుత్వం ముందుకు పోతుందన్నారు. పార్టీలకు అతీతంగా అసెంబ్లీలో బీసీ బిల్లుకు అన్ని పార్టీలు సహకరించాయనీ, పార్లమెంట్లో అందుకు భిన్నంగా ఆయా పార్టీలు వ్యవహరిస్తాయని అను కోవడం లేదని చెప్పారు. పదేండ్లపాటు రాష్ట్రాన్ని పరిపాలించిన వాళ్ళు అన్ని గాలికి వదిలేశారనీ, మాకు నిబద్ధత ఉంది కాబట్టే ప్రణాళికా ప్రకారం ముందుకు వెళుతున్నామని గుర్తు చేశారు. కార్పొరేషన్ల చైర్మెన్ల నియామకంలో రాష్ట్ర ప్రభుత్వం సామాజిక న్యాయానికి కట్టుబడి ఉంటుందని వివరించారు.
కులగణనను సక్సెస్ చేశాం..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES