- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఒక కీలక ఉత్తర్వును జారీ చేసింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) పర్యవేక్షణ బాధ్యతలను జస్టిస్ నవీన్ రావుకు అప్పగించింది. హెచ్సీఏలో వరుస అరెస్టులు జరుగుతున్న నేపథ్యంలో కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. అసోసియేషన్ వ్యవహారాలను ఇకపై జస్టిస్ నవీన్ రావు పర్యవేక్షిస్తారు. హెచ్సీఏ అక్రమాలపై దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో ఇప్పటికే అధ్యక్షుడు జగన్మోహన్ రావుతో పాటు మరో నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా ప్రధాన కార్యదర్శి దేవరాజ్ను కూడా అదుపులోకి తీసుకున్నారు.
- Advertisement -