Sunday, July 27, 2025
E-PAPER
Homeక్రైమ్హోంగార్డు ఎగ్జామ్‌ రాస్తూ స్పృహ కోల్పోయిన మహిళ..అంబులెన్స్‌లో ఇద్దరు లైంగికదాడి

హోంగార్డు ఎగ్జామ్‌ రాస్తూ స్పృహ కోల్పోయిన మహిళ..అంబులెన్స్‌లో ఇద్దరు లైంగికదాడి

- Advertisement -

నవతెలంగాణ – హైదదాబాద్: బీహార్‌లోని గయ జిల్లాలోని దారుణం జరిగింది. బోధ్‌గయ పోలీస్ స్టేషన్ పరిధిలోని బీఎంపీ-3 పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన హోం గార్డ్ నియామక పరీక్షలో పాల్గొన్న ఓ మహిళ.. పరీక్ష సమయంలో స్పృహ కోల్పోయింది. దీంతో ఆమెను ఆస్పత్రికి తరలిస్తుండగా అంబులెన్స్ డ్రైవర్, టెక్నీషియన్‌ కలిసి ఆమెపై లైంగికదాడికి ఒడిగట్టారు. ఈ నెల 24న ఈ ఘటన జరగ్గా నిన్న వెలుగులోకి వచ్చింది. సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్ఎస్పీ) ఆనంద్ కుమార్ కథనం ప్రకారం.. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా అంబులెన్స్ డ్రైవర్ వినయ్ కుమార్, టెక్నీషియన్ అజిత్ కుమార్‌లను రెండు గంటల్లోనే పోలీసులు అరెస్ట్ చేశారు. సమీపంలోని సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -