నవతెలంగాణ-భిక్కనూర్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వివిధ కార్యక్రమాల ప్రగతి, పథకాల అమలు గురించి ప్రతి జిల్లాకు ఒక ప్రత్యేక అధికారిని నియమించడం జరిగింది. కామారెడ్డి జిల్లాకు ప్రత్యేక అధికారిగా నియమించబడిన రాజీవ్ హనుమంతు జిల్లా పర్యటనలో భాగంగా పట్టణ కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శనివారం సందర్శించారు. ఆరోగ్య కేంద్రంలో అందుతున్న సేవలు, వైద్యులు వైద్య సిబ్బంది పనితీరు పరిశీలించారు. ఆసుపత్రిలో ఉన్న వివిధ విభాగాలను ప్రత్యక్షంగా పర్యవేక్షించి ఆసుపత్రిలో గల ఇన్ పేషెంట్ వార్డు, ఫార్మసీ గది, ప్రసూతి గది, లాబరేటరీ విభాగాన్ని తనిఖీ చేశారు. ఎన్ని రకాల వ్యాధి నిర్ధారణ పరీక్షలు ఏ విధంగా చేస్తున్నారు, ల్యాబ్ ద్వారా అందుతున్న పరీక్షల సేవల గురించి ఆరా తీశారు. ఆరోగ్య కేంద్రంలో రోగులకు అందిస్తున్న వివిధ రకాల సేవలు, ఔట్ పేషెంట్ సేవలు, గర్భిణీ పరీక్షలు, చిన్న పిల్లల వ్యాధినిర్వక టీకాల , కుక్కకాటుకు సంబంధించినటువంటి రాబిస్ వ్యాక్సిన్ అవసరమైన మందుల నిలువ వివరాలు వైద్యాధికారి యేమిమాని అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం భారీ వర్షాలు, వరదలు, వాతావరణంలో సంభవించే మార్పుల ద్వారా కలిగే సీజనల్ వ్యాధుల పట్ల ప్రత్యేక కార్యాచరణ రూపొందించి అప్రమత్తంగా ఉండాలని, సీజనల్ వ్యాధుల నియంత్రణ కోసం ముందు జాగ్రత్త చర్యలు చేపడుతూ కావలసిన అత్యవసర మందుల యొక్క నిలువలు తగినంత అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అందుతున్న సేవల గురించి మరియు వసతుల గురించి తెలుసుకున్న ప్రత్యేక అధికారి రాజీవ్ హనుమంతు, జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ చంద్రశేఖర్ జిల్లాలో సీజనల్ వ్యాధుల నియంత్రణ ముందు జాగ్రత్త చర్యల గురించి అప్రమత్త చర్యలు జిల్లాలో తీసుకున్న ముందస్తు చర్యలు సంసిద్ధత గురించి చేపట్టిన కార్యాచరణ గురించి తగిన ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. ప్రత్యేకంగా జిల్లాలో గల యూరియా సరఫరా తగినంత యూరియా నిలువ గురించి సమీక్షించారు. యూరియా నిలువ, సరఫరా విషయంలో గత సంవత్సరంతో పోల్చితే ఈ సంవత్సరంలో కొంత తేడా ఉండడాన్ని గమనించిన ప్రత్యేక అధికారి జిల్లా వ్యవసాయ అధికారిని వివరణ అడిగారు. జిల్లాలోని ప్రతి మండలాలలో యూరియా కొరత లేకుండా సరఫరాలో జాప్యం జరగకుండా రైతులకు తగిన సమయంలో యూరియా సరఫరా అయ్యేలా అన్ని చర్యలు చేపట్టాలని జిల్లా వ్యవసాయ అధికారిని ఆదేశించారు. పంచాయతీరాజ్, రెవెన్యూ, వ్యవసాయ, ఇతర అధికారుల సిబ్బందిని అధిక వర్షపాతం వరదల ద్వారా సంభవించే సమస్యల పట్ల అప్రమత్తంగా ఉండి తగిన చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ పర్యటనలో అడిషనల్ కలెక్టర్ చందర్ నా.