ఈ ప్రాజెక్ట్ విషయంలో బేసిన్ లోని రాష్ట్రాలతో చర్చించాకే ముందుకెళ్తాం
ఎలాంటి పనులను ఇంకా చేపట్టలేదన్న ఏపీ ప్రభుత్వం :
రాజ్యసభలో కేంద్ర జలశక్తిశాఖ సహాయమంత్రి రాజ్ భూషన్ చౌదరి వెల్లడి
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
ఏపీ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన ‘పోలవరం-బనకచర్ల లింక్ ప్రాజెక్ట్’ విషయంలో తెలంగాణ ప్రభుత్వం నుంచి అభ్యంతరాలు, ఆందోళనలు అందినట్టు కేంద్ర జలశక్తి శాఖ వెల్లడించింది. అయితే… ఈ విషయంలో గోదావరి బేసిన్ లోని తెలంగాణతో సహా భాగస్వామ్య రాష్ట్రాలు-అధికారులను సంప్రదించిన తర్వాతే ఈ లింక్ ప్రాజెక్ట్ కు సంబంధించి సాంకేతిక-ఆర్థిక అంచనా పై ముందుకెళ్తామని స్పష్టం చేసింది. ఈ మేరకు సోమవారం రాజ్యసభలో ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ అడిగిన ప్రశ్నకు కేంద్ర జలశక్తి శాఖ సహాయమంత్రి రాజ్ భూషన్ చౌదరి లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. ‘పోలవరం-బనకచర్ల లింక్ ప్రాజెక్ట్’ కు సంబంధించిన సాంకేతిక-ఆర్థిక అంచనాల కోసం ఏపీ ప్రభుత్వం కేంద్ర జలశక్తి శాఖను అభ్యర్థించినట్టు తెలిపింది. ఇందులో భాగంగా కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వరంలోని సెంట్రల్ వాటర్ కమిషన్(సీడబ్ల్యూసీ)కి ప్రిలిమినరీ ప్రీజిబిలిటి రిపోర్ట్ (పీఎఫ్ఆర్)ను అందజేసినట్టు మంత్రి వెల్లడించారు. అయితే… ఈ ప్రాజెక్ట్కు సంబంధించి ఎలాంటి పనులను ఇంకా చేపట్టలేదని కేంద్ర ప్రభుత్వానికి ఏపీ సర్కార్ వివరణ ఇచ్చిందన్నారు.
‘పోలవరం-బనకచర్ల’ పై తెలంగాణ అభ్యంతరాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES