Wednesday, July 30, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మేడారం ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ కు కాంగ్రెస్ నాయకుల పరామర్శ 

మేడారం ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ కు కాంగ్రెస్ నాయకుల పరామర్శ 

- Advertisement -

నవతెలంగాణ – తాడ్వాయి 
ములుగు జిల్లా తాడ్వాయి మండలం కొండపర్తి గ్రామానికి చెందిన, మేడారం ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ లచ్చు పటేల్ తల్లి ఎల్లమ్మ మృతి చెందింది. వారి నివాసానికి మంగళవారం మంగపేట మండలం కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ ఎంపిటిసి, జిల్లా అధికార ప్రతినిధి ఈసం యానయ్య, మాజీ ఆత్మ చైర్మన్ పగిడిపల్లి వెంకటేశ్వర్లు, లీగల్ హ్యూమన్ రైట్స్ డిస్టిక్ చైర్మన్ బండ జగన్ మోహన్ రెడ్డి, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ చెట్టిపెల్లి వెంకటేశ్వర్లు లు వెళ్లి అర్రెం ఎల్లమ్మ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ ఎల్లమ్మ చాలా మంచివారని వారు మన మధ్యన లేకపోవడం చాలా బాధాకరం అన్నారు. ఎల్లమ్మ వారి కుటుంబం ఆదర్శ భావాల గల కుటుంబమని కొనియాడారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -