- Advertisement -
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
భువనగిరి మండలం అనాజీపురంలో దివ్య బాల స్కూల్ విద్యార్థులకు ఎన్నికలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్కూల్ ఫౌండర్ చైర్మన్ రేవా ఫాదర్ కటా రాజులు హాజరై, మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు నాయకత్వ లక్షణాలు కలిగి ఉండాలి అని తెలిపారు. అనంతరం స్కూల్ కరస్పాండెంట్ చిన్నప్ప మాట్లాడుతు ప్రజాస్వామ్యంలో ఓటు చాల విలేవైనది అని తెలిపారు. విద్యార్థులు రాజకీయంగా ఎడగలి అని పిలుపు ఇచ్చారు. ఎన్నికలలో విద్యార్థులు పాఠశాల అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సౌజన్య , ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
- Advertisement -