- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతున్న సృష్టి ఫెర్టిలిటీ కేసులో పోలీసులు మరో ముగ్గురిని శనివారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఇప్పటి వరకు ఈ కేసులో 11 మందిని అరెస్టు చేశారు. ప్రధాన నిందితులు డాక్టర్ నమ్రతను ఇప్పటికే కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్న సంగతి తెలిసిందే. కాగా కేసు దర్యాప్తు దశలో ఉందని.. నిందితులందరినీ విచారిస్తున్నామని నార్త్జోన్ డీసీపీ తెలిపారు. పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామన్నారు.
- Advertisement -