Monday, August 4, 2025
E-PAPER
Homeతాజా వార్తలుట్రైన్‌లో ఫోన్ లాక్కెళ్లిన దొంగ.. కాలు కోల్పోయిన ప్రయాణికుడు

ట్రైన్‌లో ఫోన్ లాక్కెళ్లిన దొంగ.. కాలు కోల్పోయిన ప్రయాణికుడు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: ముంబైలో సెల్‌ఫోన్ దొంగతనం ఒక యువకుడి జీవితాన్ని ఛిన్నభిన్నం చేసింది. థానే జిల్లాకు చెందిన గౌరవ్ నికమ్ అనే వ్యక్తి ముంబై లోకల్ ట్రైన్‌లో ప్రయాణిస్తున్నాడు. రైలు డోర్ దగ్గర నిలబడగా.. ఓ దొంగ, అతడి చేతిలో ఉన్న మొబైల్ ఫోన్‌ను ఒక్కసారిగా లాక్కున్నాడు. ఈ క్రమంలో గౌరవ్ అదుపుతప్పి కదులుతున్న రైలులో నుంచి కిందకు జారిపడ్డాడు. అతడి కాలు రైలు చక్రాల కిందపడి నుజ్జునుజ్జయింది. ప్రయాణికుల సమాచారం మేరకు రైల్వే సిబ్బంది అతడిని ఆసుపత్రికి తరలించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -