Monday, August 4, 2025
E-PAPER
Homeతాజా వార్తలురెండు నెలల్లోనే కుంగిన డబుల్ డెక్కర్ ఫ్లై ఓవర్

రెండు నెలల్లోనే కుంగిన డబుల్ డెక్కర్ ఫ్లై ఓవర్

- Advertisement -

నవతెలంగాణ -హైదరాబాద్: బీహార్ రాజధాని పాట్నాలో ఇటీవల నిర్మించిన డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్‌లో ఒక భాగం భారీ వర్షాల కారణంగా కుంగిపోయింది. రూ.422 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ ఫ్లైఓవర్‌ను ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ రెండు నెలల క్రితం ప్రారంభించారు. పాట్నాలోని రద్దీగా ఉండే అశోక్ రాజ్‌పథ్‌లో ట్రాఫిక్‌ను తగ్గించడానికి ఈ ఫ్లైఓవర్‌ను నిర్మించారు. 2.2 కిలోమీటర్ల పొడవైన ఈ ప్రాజెక్టును జూన్ 11న ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ స్వయంగా ప్రారంభించారు.

ఆదివారం కురిసిన భారీ వర్షాలకు ఫ్లైఓవర్ మధ్యలో ఒక పెద్ద గుంత ఏర్పడింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫ్లైఓవర్‌ను బీహార్ స్టేట్ బ్రిడ్జ్ కన్‌స్ట్రక్షన్ కార్పొరేషన్ లిమిటెడ్ నిర్మించింది. అశోక్ రాజ్‌పథ్ ప్రాంతంలో రెండు ఫ్లైఓవర్ టయర్లు, గ్రౌండ్-లెవల్ సర్వీస్ రోడ్, భూగర్భ మెట్రో వ్యవస్థతో పాటు నాలుగు స్థాయుల నిర్మాణం జరగనుంది. ఫ్లైఓవర్ కుంగిపోవడంపై ప్రజల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇంత భారీ బడ్జెట్‌తో నిర్మించిన ప్రాజెక్టు నాణ్యతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -