- Advertisement -
నవతెలంగాణ – కల్లూరు
కల్లూరు ఎస్టీ గిరిజన హాస్టల్ విద్యార్థులకు ఉదయం అల్పాహారం కిచిడి తిన్న తర్వాత పదుల సంఖ్యలో విద్యార్థినీలకు ఫుడ్ పాయిజన్, ఆయాసం, తీవ్ర అవస్తలతో ప్రాణాపాయ స్థితిలో 8 సంవత్సరాల నుంచి దాదాపుగా 16 సంవత్సరాల విద్యార్థినిలు తల్లడిల్లారు. విద్యార్థుల ఫుడ్ పాయిజన్ పై చరవాణిలో ఆరా తీసిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్ విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని కల్లూరు ప్రభుత్వ వైద్యులు డాక్టర్ నవ్య కాంత్ కు ఆదేశాలు జారీ చేశారు. అత్యవసర చికిత్స జరుగుతున్నందున స్థానిక ఎమ్మార్వో పులి సాంబశివుడు హుటాహుటిన ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకొని విద్యార్థునీలా ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని పరామర్శించారు.
- Advertisement -